Asia Cup 2023: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఏడో బౌలర్‌గా..

by Vinod kumar |
Asia Cup 2023: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఏడో బౌలర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్‌గా, వన్డేల్లో భారత్‌ తరఫున కపిల్‌ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, భారత్‌ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్కును అందుకున్న ఏడో బౌలర్‌గా (337 వన్డే వికెట్లతో కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు) రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో షమీమ్‌ హొస్సేన్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా జడ్డూ వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో 182వ వన్డే ఆడుతున్న జడ్డూ.. 200 వికెట్లతో పాటు 2578 పరుగులు చేశాడు.

Advertisement

Next Story