Ashes 2023: ఉస్మాన్‌ ఖ్వాజా సెంచరీ.. పోరాడుతున్న ఆసీస్..

by Vinod kumar |
Ashes 2023: ఉస్మాన్‌ ఖ్వాజా సెంచరీ.. పోరాడుతున్న ఆసీస్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌లో 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఉస్మాన్‌ ఖ్వాజా (102 నాటౌట్‌) సెంచరీతో ఆదుకున్నాడు. ట్రవిస్‌ హెడ్‌ (50) సాయంతో అతను ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. టెస్ట్‌ల్లో ఖ్వాజాకు ఇది 15వ శతకం. ఉస్మాన్‌ ఖ్వాజా సెంచరీతో ఆదుకోవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం‍ చేస్తుంది. ఆ జట్టు 70 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 163 పరుగులు వెనుకపడి ఉంది. ఖ్వాజాకు జతగా అలెక్స్‌ క్యారీ (3) క్రీజ్‌లో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed