న్యూజిలాండ్, అఫ్గాన్ జట్లకు షాక్.. తొలి రోజు ఆట రద్దు

by Harish |
న్యూజిలాండ్, అఫ్గాన్ జట్లకు షాక్.. తొలి రోజు ఆట రద్దు
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్, అఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్టుకు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. నోయిడాలోని గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో సోమవారం టెస్టు ప్రారంభమవ్వాల్సి ఉండగా ఇరు జట్లకు షాక్ తగిలింది. టాస్ కూడా పడకుండానే తొలి రోజు ఆట రద్దైంది. నోయిడాలో గత రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం వర్షం పడనప్పటికీ ఔట్‌ఫీల్డ్‌ వర్షపు నీటితో నిండిపోయింది. సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ గ్రౌండ్ తడిగానే ఉంది. అంపైర్లు పలుమార్లు తనిఖీలు చేసిన తర్వాత ఆట సాధ్యం కాదని నిర్ణయం తీసుకున్నారు. మైదానం తడిగా ఉండటంతో ఆటగాళ్లు జారి పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అంపైర్లు తొలి రోజ ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా నాలుగు రోజులు అరగంట ఎక్కువ సేపు ఆటను నిర్వహిస్తామని తెలిపారు. అయితే, వర్ష సూచన నేపథ్యంలో మిగతా రోజులు కూడా మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed