- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
యశ్ ధుల్ సూపర్ సెంచరీ.. ఆసియా కప్లో టీమిండియా బోణీ
దిశ, వెబ్డెస్క్: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో టీమిండియా బోణీ కొట్టింది. యూఏఈతో ఇవాళ జరిగిన మ్యాచ్లో భారత్-ఏ.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ యశ్ ధుల్ అజేయమైన సూపర్ సెంచరీతో (84 బంతుల్లో 108; 20 ఫోర్లు, సిక్స్) రాణించగా.. అతనికి నికిన్ జోస్ (41 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా భారత్.. మరో 23.3 ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ ఇన్నింగ్స్లో అయాన్ష్ శర్మ (38), కెప్టెన్ చిదంబరం (46), అలీ నసీర్ (10), మొహమ్మద్ ఫరాజుద్దీన్ (35), జష్ గియనాని (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లో.. హర్షిత్ రాణా (4), నితిశ్ రెడ్డి (2), మానవ్ సుథార్ (2), ఆకాశ్ సింగ్ (1) వికెట్లు తీశారు.
An unbeaten 108*(84) in the chase makes skipper Yash Dull the Player of the Match against UAE 'A' 👏👏
— BCCI (@BCCI) July 14, 2023
India 'A' start off with a victory and 2️⃣ points 🙌#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/t30RTRVMji