దారుణం: తండ్రిని చంపిన కొడుకు

by  |
దారుణం: తండ్రిని చంపిన కొడుకు
X

దిశ, సిద్దిపేట: కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. తండ్రిపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశాడు ఓ కొడుకు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని శివాజీనగర్‎లో చోటు చేసుకుంది

వివరాల్లోకి వెళ్తే.. వినాయక ఆర్థోపెడిక్ ఆస్పత్రి వెనుక బిల్డింగ్‎లో ఎల్లయ్య అనే వ్యక్తిని తన కొడుకు ప్రసాద్ బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ప్రసాద్ మృతుడి రెండో భార్య కొడుకు కాగా, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని స్థానికులు తెలిపారు. తండ్రి, కొడుకుల మధ్య జరిగిన గొడవ కారణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితుడు ప్రసాద్ పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలిని ఏసీపీ రామేశ్వర్ పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed