22న ములుగు జిల్లాలో షర్మిల పోడు యాత్ర

by  |
YS Sharmila
X

దిశ, ములుగు: వైఎస్సార్ టిపి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఈ నెల 22న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. గిరిజనుల పోడు సమస్య పరిష్కారానికి షర్మిల ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన ఏజెన్సీ ప్రాంతం మారుమూల ఆదివాసి గిరిజన గ్రామమైన లింగాల నుంచి పోడు యాత్రను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ షర్మిల పోడు భూములకు పట్టాలివ్వాలని పోరాటం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Next Story