ప్రసాద్‌గౌడ్‌‌కు సేవాభారతి పురస్కారం

by Shyam |   ( Updated:2021-08-24 07:49:25.0  )
Prakash Goud
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండు ద‌శాబ్ధాలుగా న‌గ‌రంలో స‌మాజ సేవ‌కు అంకిత‌మై.. అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రజా నాయకుడికి విలువైన గుర్తింపు దక్కింది. ప్రకృతి విపత్తుల్లో, ప్రజలకు ఆపదలో అన్నివేళలా అండగా నిలిచిన నేతను మహా గౌరవం వరించింది. విశేష సమాజ సేవకులకు ప్రతిఏటా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ సంయుక్తంగా ప్రదానం చేస్తున్న సేవాభారతి-2021 పురస్కారం ఈ ఏడాది కుత్బుల్లాపూర్ బీజేపీ నేత ప్రసాద్ గౌడ్‌కు దక్కింది.

బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు ప్రసాద్ గౌడ్‌. ఆయన నిస్వార్థ సేవకు గుర్తింపు దక్కడంపై రాష్ట్ర బీజేపీ నేతలు, నియోజకవర్గ కమలదళం హర్షం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed