అధికారులతో బొల్లం ముచ్చట

by  |
అధికారులతో బొల్లం ముచ్చట
X

దిశ, కోదాడ: వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున విద్యుత్ కొరత లేకుండా చేసేందుకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రైతులకు లో-వోల్టేజీ సమస్య లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరెంటు తీగలు లాగడం, స్తంభాలు ఏర్పాటు, ట్రాన్సాఫార్మర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed