బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ మరో ట్విస్ట్ 

by  |
బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ మరో ట్విస్ట్ 
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హైడ్రామా నెలకొంది. హీరోయిన్లు దీపికా పడుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లకు ఎన్సీబీ నోటీసులు ఇచ్చినట్టు తెలిపింది. ఈ వార్తలను ఖండిస్తూ… తనకు ఎన్సీబీ నోటీసులు అందలేదన్న టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ మరో ట్విస్ట్ ఇచ్చింది. తనకు నోటీసులు అందాయంటూ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఆమె రేపు ఎన్సీబీ ముందు విచారణకు హాజరు కానుంది.

రకుల్ తోపాటు శృతి మోడీ, సిమోన్ ను విచారించనున్నారు అధికారులు. వీరితోపాటు రేపు విచారణకు హాజరు కావాలంటూ బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనే కు కూడా ఎన్సీబీ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో రేపు రకుల్ తోపాటు దీపికా కూడా విచారణకు హాజరవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఎల్లుండి శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ను ఎన్సీబీ అధికారులు విచారణకు రావాల్సిందిగా ఆదేశాలిచ్చారు.


Next Story

Most Viewed