7 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్..!

by  |
7 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఏడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

మొత్తం కరోనా కేసుల్లో 65.5శాతం, మరణాల్లో 75 శాతం వరకు ఈ ఏడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్‌, ఢిల్లీలో కరోనా మరణాలు దేశ సగటు 1.6 శాతం కంటే ఎక్కువగా.. రెండు శాతం ఉండడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహమ్మారి కట్టడికి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం సహకారం, ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాల పెంపు, తదితర అంశాలపై మోదీ చర్చించనున్నారు.


Next Story

Most Viewed