రేవంత్.. నీ చిత్త శుద్దిని నిరూపించుకో : ధర్మపురి అరవింద్

by M.Rajitha |
రేవంత్.. నీ చిత్త శుద్దిని నిరూపించుకో : ధర్మపురి అరవింద్
X

దిశ, వెబ్ డెస్క్ : గత ప్రభుత్వం అవినీతిపై కమీషన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి చిన్న విషయానికి అరెస్ట్ చేయించిందని, మరి ఆ స్థాయిలో ఇపుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామన్న అరవింద్.. ఆ పార్టీ ఓ చీడ పురుగని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేది అవాస్తవం అని, గడిచిన పదేళ్ళలో తెలంగాణకు రూ.31 వేల కోట్లు మంజూరు చేసిందని ఈ సందర్భంగా మంత్రి అరవింద్ గుర్తు చేశారు. అధ్యక్ష పదవి గురించి తాను ఏం మాట్లాడబోనని, అధిష్టానం ఎవరికి ఇచ్చినా తనకు సమ్మతమే అన్నారు. అసెంబ్లీలో తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి చాలా బాగా మాట్లాడుతున్నారని ప్రశంసించారు. అసెంబ్లీ ఇన్నిరోజులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని, గడిచిన పదేళ్ళలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని అన్నారు.

Next Story

Most Viewed