కోదండరాం, మీర్ అలీఖాన్ నియామకం ఆపండి : గవర్నర్ కు శ్రవణ్ దాసోజు లేఖ

by M.Rajitha |
కోదండరాం, మీర్ అలీఖాన్ నియామకం ఆపండి : గవర్నర్ కు శ్రవణ్ దాసోజు లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : గవర్నర్ కోటాలో కోదండరామ్, మీర్ అలీఖాన్ ల ఎంఎల్సీ నియామకం ఆపాలని బీఆర్ఎస్ నాయకుడు శ్రవణ్ దాసోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శుక్రవారం లేఖ రాశారు. గవర్నర్ కోటాలో ఎంఎల్సీల నియామకం మీద వివాదం సుప్రీం కోర్టులో ఉన్నందున, దీనిపై తుది నిర్ణయం తీసుకోవద్దని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళిద్దరి నియమకానికి అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎంఎల్సీలుగా సిఫారసు చేయగా, అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్ కు ఉందా లేదా అనే అంశంపై శ్రవణ్ సుప్రీం కోర్టుకు వెళ్ళగా.. తుది తీర్పు వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని లేఖ రాశారు. అయితే గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.

Next Story

Most Viewed