పేకాట స్థావరంపై దాడి

by Shyam |
పేకాట స్థావరంపై దాడి
X

దిశ, జుక్కల్: దీపావళి పండగా వస్తుందంటే చాలు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పేకాట స్థావరాల కోకొల్లలుగా ఏర్పడతాయి. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 2,77,253 నగదు, 18 సెల్ ఫోన్లు , 8 బైకులను స్వాధీనం చేసుకున్నారు. బిచ్కుందతో పాటు జుక్కల్, మద్నూర్, పిట్లం,పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలాలలోని ఆయా గ్రామాలలో స్థావరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed