రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

by  |
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
X

దిశ, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బోలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దిరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృత చెందిన వ్యక్తి సూర్యాపేట జిల్లా కు చెందిన దూబని గురువయ్య(34)గా పోలీసులు గుర్తించారు.


Next Story

Most Viewed