ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవ.. కువైట్ నుంచి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్న మహిళ

by Bhoopathi Nagaiah |
ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవ.. కువైట్ నుంచి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్న మహిళ
X

దిశ, బుట్టాయగూడెం : మండలంలోని మర్లగూడెం గ్రామానికి చెందిన తాటి సంకురమ్మ అనే గిరిజన మహిళ గత సంవత్సరం ఉపాధి నిమిత్తం కువైట్ దేశానికి వెళ్ళింది. ప్రస్తుతం అక్కడున్న వారు తనని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆ వీడియో చూసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించి వారి కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఆగస్టు 20వ తేదీన మంగళవారం కువైట్ నుండి తమ స్వగ్రామానికి వస్తున్నట్లు ఆ మహిళ వివరించారు. తన కోసం అధికారులతో, ఏజెంట్లతో మాట్లాడి, తనను సురక్షితంగా మా స్వగ్రామానికి తీసుకురావడానికి కష్టపడిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుకు తాటి సంకురమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed