Zeeshan: బాబా సిద్ధిఖీ మరణాన్ని రాజకీయం చేయొద్దు.. ఎమ్మెల్యే జీషన్ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Zeeshan: బాబా సిద్ధిఖీ మరణాన్ని రాజకీయం చేయొద్దు.. ఎమ్మెల్యే జీషన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీ హత్యపై ఆయన కుమారుడు, బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ స్పందించారు. తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయొద్దని, కుటుంబానికి న్యాయం చేయాలని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘బాబా సిద్ధిఖీ పేద ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. వారి జీవితాలను రక్షించేందుకు నిరంతరం పాటు పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన తన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో నా కుటుంబం విచ్ఛిన్నమైంది. నా తండ్రి మరణాన్ని రాజకీయం చేయొద్దు. నా కుటుంబానికి న్యాయం కావాలి. బాబా సేవలను వృథా చేయొద్దు’ అని పేర్కొన్నారు. కాగా, బాబా సిద్ధిఖీని ఇటీవల ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed