BSNL : త్వరలోనే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ 4జీ, 5జీసేవలు

by Hajipasha |
BSNL : త్వరలోనే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ 4జీ, 5జీసేవలు
X

న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ 4జీ, 5జీసేవలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. దీనిపై తాము ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంటీఎన్‌ఎల్ అప్పుల్లో ఉన్నందున.. దాని నిర్వహణ బాధ్యతలను బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించామని ఆయన చెప్పారు. అయితే ఎంటీఎన్‌ఎల్ సావరిన్ బాండ్లు కొన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆ బాండ్ల వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందనే విషయాన్ని మదుపరులు గుర్తుంచుకోవాలన్నారు. బాండ్లకు పూర్తి హామీ, భద్రత ఉంటుందని సింధియా స్పష్టంచేశారు.

టాటా తేజస్ నెట్ వర్క్స్, టీసీఎస్, ప్రభుత్వరంగ కంపెనీ సీడాట్‌లు కన్సార్టియంగా ఏర్పడి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ల కోసం 4జీ, 5జీ మౌలిక సదుపాయాలను రెడీ చేసే పనిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. విదేశాల నుంచి టెలికాం టెక్నాలజీని అరువుకు తేవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. స్వదేశంలోనే టెక్ విప్లవానికి బీజాలు వేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. మనదేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలో తయారయ్యే 4జీ, 5జీ టెక్నాలజీని విదేశాలకు కూడా విక్రయించనున్నట్లు తెలిపారు.



Next Story