- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మరో హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలి : ప్రధాని మోడీ
by Vinod kumar |
X
న్యూఢిల్లీ : కరోనా లాంటి మరో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సమాయత్తమై ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆరోగ్య అంశాల్లో ప్రపంచ దేశాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి గుర్తు చేసిందన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో శుక్రవారం జరిగిన జీ20 దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ వర్చువల్గా ప్రసంగించారు.
ఆరోగ్య విపత్తులు తలెత్తినప్పుడు వైద్య, సాంకేతిక ఆవిష్కరణల కోసం ప్రపంచ దేశాలు వేటికవిగా పరిశోధనలు చేయడం కంటే.. కలిసికట్టుగా గ్లోబల్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులను చేపట్టడం వల్ల నిధుల దుబారాకు చెక్ పెట్టొచ్చని సూచించారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు నిర్దేశించిన గడువు (2030 సంవత్సరం) కంటే ముందే క్షయ (టీబీ) వ్యాధిని భారత్ నిర్మూలిస్తుందన్నారు.
Advertisement
Next Story