Shashi Tharoor : కర్ణాటక రిజర్వేషన్ బిల్లు అవివేకం.. శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

by Hajipasha |
Shashi Tharoor : కర్ణాటక రిజర్వేషన్ బిల్లు అవివేకం.. శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించడమే అవివేకమని పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ విమర్శించారు. ఆ తరహా చట్టాలు చేయడం "రాజ్యాంగ విరుద్ధం" అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో శశి థరూర్ మాట్లాడారు. ‘‘ప్రతి పౌరుడు దేశంలో నచ్చిన చోట నివసిస్తూ, పనిచేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఈ రాజ్యాంగ భావనకు వ్యతిరేకంగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు తేవాలనే ఆలోచనే సరికాదు’’ అని ఆయన పేర్కొన్నారు. గతంలో హర్యానా ప్రభుత్వం ఇలాంటి రిజర్వేషన్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు తిరస్కరణ ఎదురైందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.



Next Story