- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Donald Trump: మరో సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టినప్పట్నుంచి ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా.. బైడెన్ ప్రభుత్వం ఆఖరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్షలు చెల్లవని వెల్లడించి ట్రంప్ అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత అధ్యక్షుడు బైడెన్ వీటికి సంబంధించిన ఆదేశాలపై ఆటోపెన్తో సంతకాలు చేశారని.. వాటిని ఆయనకు తెలియకుండానే అమలు చేశారని ట్రంప్ వాదిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘బైడెన్ నిద్ర మత్తులో చాలామందికి క్షమాభిక్షలు పెట్టారు. అవి చెల్లవు. ఎలాంటి ప్రభావం చూపవని నేను ఇప్పుడు ప్రకటిస్తున్నా. ఎందుకంటే అవి ఆటోపెన్ తో చేసినవి. ఓ రకంగా చెప్పాలంటే బైడెన్ వాటిపై సంతకం చేయలేదు. అసలు ఆయనకు ఈ విషయం తెలియదు. వాటికి అవసరమైన పత్రాల గురించి బైడెన్కు వెల్లడించలేదు. ఆయన ఆమోదించలేదు. ఈ వ్యవహారం నడిపినవారు నేరం చేశారు. ఆ తర్వాత అదే అన్సెలెక్ట్ కమిటీ.. నాతో సహా మరికొందరు అమాయకులపై రెండేళ్లపాటు నిర్వహించిన తప్పుడు దర్యాప్తులో సంపాదించిన ఆధారాలు మొత్తం నాశనం చేశారు. వారు అత్యున్నతస్థాయి దర్యాప్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం చేసుకోవాలి’’ అని ట్రంప్ హెచ్చరించారు.
1500 మందికి శిక్ష తగ్గింపు
మరోవైపు, బెడైన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి కొన్ని గంటల ముందు పదుల సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్షలు ప్రసాదించారు. గతేడాది డిసెంబర్ 12న ఒకేరోజు 1500 మంది ఖైదీల శిక్షలను తగ్గించారు. మరో 39 మంది ఖైదీలను క్షమించారు. అమెరికా చరిత్రలో ఈ స్థాయిలో క్షమాభిక్షలు ఎవరూ ప్రసాదించలేదు. ఈ జాబితాలో ఆయన సోదరులు జేమ్స్, ఫ్రాన్సిస్, సోదరి వేలేరి, వారి పార్ట్ నర్స్ కి క్షమాభిక్షలు ప్రసాదించారు. బైడెన్ తన కుమారుడికి కూడా క్షమాభిక్ష పెట్టారు. రాజకీయ వేధింపులకు తన కుటుంబసభ్యులు బయలయ్యారని బైడెన్ ఆరోపించారు.
Read More..
Trump: రేపు పుతిన్తో మాట్లాడనున్న ట్రంప్.. కాల్పుల విరమణపై డిస్కస్ చేసే చాన్స్!