- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుర్తు తెలియని మృతదేహం లభ్యం.. ఆకలి చావా, వడదెబ్బా..
by Sridhar Babu |

X
దిశ, శామీర్ పేట్ : శామీర్ పేట్ పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం లభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతవారం రోజుల నుంచి తూంకుంట మున్సిపాలిటీలోని వెంకటేశ్వర కాలనీలో గుర్తు తెలియని మతి స్థిమితం లేని వ్యక్తి చొక్కా, చెప్పులు లేకుండా సంచరిస్తుండటం కాలనీవాసులు గమనించారు. కాగా శుక్రవారం వెంకటేశ్వర కాలనీలోని ఓపెన్ వెంచర్లో అతను చనిపోయి ఉన్నాడని కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా గత వారం రోజుల నుంచి తిండి, నీరు లేక వడదెబ్బ వలన చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story