నాగంపేటలో చోరీ

by Sridhar Babu |
నాగంపేటలో చోరీ
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో శుక్రవారం ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు జమ్మికుంట టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగంపేట గ్రామానికి చెందిన దార రవి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు పొలంలో పనికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రూ. 30 వేల విలువగల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీ గురైనట్టు గుర్తించాడు. గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు

Next Story