Vande Bharat Express : రాత్రి పూట నడిచే తొలి వందే భారత్ ట్రైన్.. ఏ రూట్‌లో అంటే?

by Rajesh |
Vande Bharat Express : రాత్రి పూట నడిచే తొలి వందే భారత్ ట్రైన్.. ఏ రూట్‌లో అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: రైలు ప్రయాణీకులను వేగంగా గమ్యాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. సౌత్ సెంట్రల్ రైల్వే తొలిసారిగా 2023 నవంబర్ 21న ఈ ట్రైన్ సేవలను ప్రారంభించనుంది. తమిళనాడు, కర్ణాటక మధ్య సెమీ హై స్పీడ్ ను రాత్రిపూట నడపనున్నారు. మరో వందే భారత్ స్పెషల్ ట్రైన్ యశ్వంత్ పూర్-బెంగళూరు నుండి చెన్నై సెంట్రల్ మధ్య నడవనుంది.

చెన్నై సెంట్రల్ నుంచి 8 కోచ్ ల వందేభారత్ ఎక్స్ ప్రెస్ నవంబర్ 21న (మంగళవారం) రాత్రి 11 గంటలకు బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఇక ఐదున్నర గంటల్లోనే గమ్యాన్ని ఈ ఎక్స్ ప్రెస్ చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం 34 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పగటిపూట నడుస్తుండగా తొలిసారి ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళ ఈ సేవలను ప్రారంభించనుంది. ప్రయాణీల నుంచి రెస్పాన్స్ ను బట్టి మరిన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించే ఆలోచన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story