- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జమ్మూలో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఆర్మీ కాన్వాయ్పై దాడి

X
దిశ, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనంపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. గురువారం పూంచ్ జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై ఈ దాడి జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు టెర్రరిస్టులపై ఎదురుకాల్పులు జరిపాయి. ప్రస్తుతం జవాన్లు, ఉగ్రవాదాలుకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కాల్పులు జరుగుతున్న ప్రదేశానికి అదనపు బలగాలను సైన్యం పంపిస్తోంది. కాగా ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. తాజా ఘటనలో ప్రాణనష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story