- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
నీట్ పేపర్ లీక్తో తేజస్వీ యాదవ్కు సంబంధం!: బిహార్ డిప్యూటీ సీఎం సంచలన ఆరోపణలు
దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. పాట్నాలో నీట్ పేపర్ లీక్తో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ సన్నిహితుడికి దగ్గరి సంబంధం ఉందని తెలిపారు. గురువారం విజయ్ మీడియాతో మాట్లాడారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో అరెస్టైన సికిందర్ యాద్వెందు తేజస్వీ పీఏ ప్రీతమ్ కుమార్ సమీప బంధువు అని చెప్పారు. యాదవెందు తన మేనల్లుడైన నీట్ విద్యార్థి అనురాగ్ యాదవ్, ఇతర సహచరులను పాట్నాలోని ప్రభుత్వ బంగ్లాలో ఉంచడానికి సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థి బస చేసిన గెస్ట్ హౌస్లో ప్రీతమ్ గదిని కూడా బుక్ చేశారన్నారు. ‘తేజస్వి ఆదేశాల మేరకు ఏయే అధికారులు పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు చేస్తున్నా. ఆర్జేడీ చరిత్ర మొత్తం నేరాలు, అవినీతిపై ఆధారపడి ఉందని విమర్శించారు. కాగా, నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ బిహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నుంచి వివరణ కోరిన విషయం తెలిసిందే.