జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట: ఒకరు మృతి!

by vinod kumar |
జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట: ఒకరు మృతి!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని పూరీలో జరిగిన ప్రఖ్యాత జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలిరావడంతో రథయాత్ర సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక ఓ భక్తుడు మరణించగా..మరో 400 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. భారీ ఊరేగింపు జరుగుతున్న పూరీలోని గ్రాండ్ రోడ్ బారా దండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే మరణించిన భక్తుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒడిశా ఆరోగ్య మంత్రి ముఖేష్ మహలింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కాగా, ఈ రథయాత్రకు లక్ష మందికి పైగా భక్తులు పూరీకి వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story