- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట: ఒకరు మృతి!
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని పూరీలో జరిగిన ప్రఖ్యాత జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలిరావడంతో రథయాత్ర సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక ఓ భక్తుడు మరణించగా..మరో 400 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. భారీ ఊరేగింపు జరుగుతున్న పూరీలోని గ్రాండ్ రోడ్ బారా దండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే మరణించిన భక్తుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒడిశా ఆరోగ్య మంత్రి ముఖేష్ మహలింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కాగా, ఈ రథయాత్రకు లక్ష మందికి పైగా భక్తులు పూరీకి వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.