Snake In Train: గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాము ప్రత్యక్షం..వైరల్ అవుతున్న వీడియో

by Maddikunta Saikiran |
Snake In Train: గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాము ప్రత్యక్షం..వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్:నడుస్తున్న రైలు(Train)లో పాము(Snake) కనిపించడం కలకలం సృష్టించింది.మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం జబల్‌పూర్(Jabalpur) నుంచి ముంబై(Mumbai) వెళ్తున్నగరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు(Garib Rath Express Train)లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.మహారాష్ట్ర(Maharastra)లోని కాసర రైల్వే స్టేషన్(Kasara Railway Station) సమీపిస్తున్న వేళ జీ3 ఏసీ బోగీ(G3 AC Coach)లోని సీట్ నెంబర్ 23కి దగ్గర ఒక్క సారిగా పాము ప్రత్యక్షమయింది.దీంతో బోగీలో ఉన్న ప్రయాణికులు హడలెత్తిపోయారు.పాముకి బయపడి వెంటనే వేరే కోచ్ లోకి పరుగులు తీశారు.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని,రైల్వే సిబ్బంది తర్వాతి స్టేషన్లో పాముని పట్టుకొని బయట వదిలేశారని అధికారులు వెల్లడించారు.కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed