Shocking: డోర్ దగ్గర నిలబడొద్దన్న కండక్టర్.. కత్తితో పొడిచిన ప్రయాణికుడు

by Ramesh Goud |
Shocking: డోర్ దగ్గర నిలబడొద్దన్న కండక్టర్.. కత్తితో పొడిచిన ప్రయాణికుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డోర్ దగ్గర నిలబడొద్దని చెప్పినందుకు బస్ కండక్టర్‌ను ఓ యువకుడు కత్తితో పొడిచిన ఘటన బెంగుళూరులో జరిగింది. ఘటన ప్రకారం వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఓ వ్యక్తి బీఎంటీసీ వోల్వో బస్సులో ఎక్కి డోర్ వద్ద నిలుచున్నాడు. బస్ కండక్టర్ యోగేష్(45) భద్రతా ప్రమాణాల దృష్యా ఆ యువకుడిని లోపలికి రమ్మని హెచ్చరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి కండక్టర్ పై దాడికి దిగాడు. అంతేగాక బ్యాగ్ లో నుంచి కత్తి తీసి కండక్టర్ ను పొడిచాడు. అనంతరం ప్రయాణికులపై కూడా దాడి చేసేందుకు యత్నిస్తూ.. అందరిని బస్ దిగి వెళ్లిపోవాలని బెదిరించాడు. దీంతో డ్రైవర్ సిద్ద లింగస్వామి దాడి చేసిన వ్యక్తిని బస్సులోనే లాక్ చేసి కిందికి దూకాడు.

అనంతరం ఆ యువకుడు తన వద్ద ఉన్న సుత్తి ఉపయోగించి బస్ అద్దాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. ఈ లోగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయపడ్డ కండక్టర్ యోగేష్ ను చికిత్స నిమిత్తం దగ్గర‌లోని వైదేహి ఆసుపత్రికి తరలించారు. నిందితుడు జార్ఖండ్ కు చెందిన హర్ష సిన్హా(25) గా పోలీసులు గుర్తించారు. సిన్హా ఇటీవలే బీపీఓ సంస్థలో ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడని తెలుసుకున్నారు. ఇంటర్వ్యూకి హాజరై తిరిగి వస్తున్నాడని, సెలెక్ట్ కాలేదనే అసహనంలో ఇదంతా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు బస్సులో కత్తి పట్టుకొని హల్చల్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story