కాకతీయ కాలువలో ఒకరు గల్లంతు

by Naveena |
కాకతీయ కాలువలో ఒకరు గల్లంతు
X

దిశ, బాల్కొండ : ముక్కల్ మండలంలోని రేంజర్ల గ్రామానికి చెందిన జగదీష్ (58) ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో గల్లంతయ్యాడు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సారెస్పీ అధికారులు కాకతీయ కాలువకు బుధవారం ఉదయం నీటి విడుదలను నిలుపుదల చేశారు. స్థానికుల సమాచారం మేరకు..గ్రామస్తులు అందరూ కలిసి కాకతీయ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్ గతంలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తుండేవాడని...ప్రస్తుతం తన సొంత ఇంట్లోనే కిరాణా షాప్ పెట్టుకున్నాడని స్థానికులు తెలిపారు. జగదీష్ కాలువలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడా లేదా ఆత్మహత్య యత్నం చేశాడా అన్నది తెలియడం లేదన్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు పూర్తికాగానే.. కాల్వకు నీటి విడుదలను ఎస్సారెస్పీ అధికారులు పునః ప్రారంభిస్తామన్నారు.

Next Story