- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
చంద్రబాబు, నితీష్ కుమార్లతో టచ్లో ఉన్న శరద్ పవార్!
దిశ, నేషనల్ బ్యూరో: లోక్సభ ఎన్నికల్లో 350కు పైగా సీట్లను సాధిస్తామని బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వస్తుండటంతో బీజేపీ అగ్ర నాయకత్వంలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్లు ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడానికి వారి మద్దతు అవసరం కానుంది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్లో 30 స్థానాల ఆధిక్యంలో ఈ రెండూ లిడింగ్లో ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఇండియా కూటమికి చెందిన శరద్ పవార్ చంద్రబాబు, నితీష్ కుమార్లతో టచ్లో ఉన్నట్లు సమాచారం. బీజేపీ, శరద్ పవార్ మధ్య సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో రాజకీయ విభేదాలకు అతీతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అంచనాల కంటే తక్కువగా సీట్లు రావడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్కు చెందిన జేడీ(యూ) మద్దతు ఎన్డీయేకు కీలకం కానుంది.