- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రూ.64.58కోట్ల ఫీజు తిరిగివ్వాలి..ప్రయివేటు స్కూళ్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు
దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.64.58కోట్ల ఫీజును తిరిగి చెల్లించాలని 10 ప్రయివేటు పాఠశాలలకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కూళ్లు నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశాయని తెలిపింది. జబర్ పూర్ జిల్లాలో ఉన్న పలు పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఘన శ్యామ్ సోనీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం ఓ కమిటీని వేసి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో 10 స్కూళ్లు 2018-19 నుంచి 2024-25 మధ్య కాలంలో 81,117 మంది విద్యార్థుల నుంచి రూ.64.58 కోట్ల ఫీజులు వసూలు చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫీజును స్టూడెంట్స్కు తిరిగివ్వాలని ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది.
కాగా, పాఠశాలలు 10శాతానికి పైగా ఫీజులు పెంచాలనుకుంటే జిల్లా అధికారుల అనుమతి తీసుకోవాలి. అలాగే 15శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కానీ ఈ స్కూళ్లు ఎటుంటి పర్మిషన్ తీసుకోకుండానే ఇష్టానుసారంగా ఫీజులు పెంచినట్టు తేలింది. ఈ క్రమంలోనే చర్యలు తీసుకున్నారు. అంతకుముందు మే 27న జబల్పూర్ జిల్లా యంత్రాంగం వరుసగా ఫీజులు, పాఠ్యపుస్తకాల ధరలను అక్రమంగా పెంచినందుకు పాఠశాల నిర్వాహకులు, కొంతమంది పుస్తకాల షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.