సీఎం గెహ్లాట్‌కు సిగ్గుంటే రాజీనామా చేయాలి : Amit Shah

by Vinod kumar |   ( Updated:2023-09-09 12:50:46.0  )
సీఎం గెహ్లాట్‌కు సిగ్గుంటే రాజీనామా చేయాలి : Amit Shah
X

జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ సీఎం గెహ్లాట్ కు కొంచెమైనా సిగ్గుంటే రెడ్ డైరీ వ్యవహారంలో రాజీనామా చేసి.. ఎన్నికల బరిలోకి దిగాలి’ అని డిమాండ్ చేశారు. ఆ రెడ్ డైరీలో గెహ్లాట్ ప్రభుత్వం అవినీతి చిట్టా, నల్లదందాల వివరాలు ఉన్నాయన్నారు. ‘గెహ్లాట్ సాబ్‌కు రెడ్ కలర్ అంటే ఇప్పుడు చాలా భయం.. డైరీ రంగు ఎరుపు.. కానీ అందులో ఉన్నవన్నీ బ్లాక్ దందాల చిట్టాలే. అందులో కోట్లాది రూపాయల అవినీతి బాగోతం వివరాలున్నాయి’ అని అమిత్ షా ఆరోపించారు.

శనివారం రాజస్థాన్‌లోని గంగాపూర్ సిటీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సహకార్ కిసాన్ సమ్మేళన్’ సభలో ప్రసంగిస్తూ.. కేంద్ర హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభల దగ్గరికి కొంతమందిని పంపి నినాదాలు చేయించడం ద్వారా ముఖ్యమంత్రి గెహ్లాట్ సాధించేదేమీ ఉండదన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను ఆరు రెట్లు పెంచిందని, సహకార శాఖల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.

Advertisement

Next Story