- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రేపు ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రధాని భేటీ..
by Vinod kumar |
X
బెంగళూరు : చంద్రయాన్-3 సక్సెస్ నేపథ్యంలో ప్రధాని మోడీ శనివారం బెంగళూరులోని ఇస్రోకు చెందిన టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ఇస్ట్రాక్) కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను స్వయంగా కలిసి ఆయన శుభాకాంక్షలు చెప్పనున్నారు. అనంతరం ఇస్రో సైంటిస్ట్లతో మోడీ భేటీ కానున్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇస్ట్రాక్ కార్యాలయంలో ప్రధాని మోడీ ఉంటారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
అనంతరం బెంగళూరు నుంచి బయలుదేరి 8.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారని తెలిపింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్పోర్టు, జలహళ్లి క్రాస్ రోడ్డు వద్ద ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు కర్ణాటక బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరు నగరంలో 10 వేల మందితో భారీ రోడ్ షో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Next Story