Kharge : మోడీ సర్కారుకు ప్రజలే గుణపాఠం చెబుతారు : ఖర్గే

by Hajipasha |
Kharge : మోడీ సర్కారుకు ప్రజలే గుణపాఠం చెబుతారు : ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలోని మోడీ సర్కారుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. దేశంలో వరుసగా చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. వీటిని నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు తగిన గుణపాఠం నేర్పక ముందే మేల్కొనాలని సూచించారు. రైల్వే శాఖలోని కీలక సాంకేతిక విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకుంటే రైల్వేలు నిర్వీర్యం అవుతాయని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.

రైల్వే శాఖ బలహీనపడినందు వల్లే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైల్వేలకు కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. బడ్జెట్ రూపకల్పనలో బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. బడ్జెట్ లాంటి ముఖ్యమైన విషయంలో ప్రతిపక్షాలు, రాష్ట్రాల సూచనలను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.



Next Story