Owaisi : బీజేపీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Maddikunta Saikiran |
Owaisi : బీజేపీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. లోక్ సభలో ఈ రోజు వక్ఫ్ బోర్డు బిల్లుపై చర్చ సందర్బంగా హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు శత్రువు అనడానికి ఈ బిల్లు ఒక ఉదాహరణని విమర్శించారు.వక్ఫ్ బోర్డు బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంగిస్తోందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ప్రతి పౌరుడు వారు నమ్మిన విశ్వాసాన్ని ఆచరించడానికి అవకాశం కల్పిస్తుందని ఒవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరమేముందని, ఆలయ కమిటీల్లో హిందూ వేతరులు ఉన్నారా..?అలాంటప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తిలో దాని అవసరం ఏమిటని ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే.. ఈ ప్రభుత్వం దేశంలో మైనారిటీ వర్గాలైన ముస్లింలనే కాకుండా సిక్కులను, క్రిస్టియన్లను కూడా వేధిస్తోందని ఒవైసీ సంచలన వాఖ్యలు చేశారు.

కాగా.. ఈ బిల్లుపై ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ లోక్ సభ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు . ఈ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధం .. వక్ఫ్ బోర్డు అనేది ఒక సంస్థని , అది మతపరమైన స్థలం కాదని కేంద్రం వాదిస్తోంది .. కానీ ఇది తప్పు ఎందుకంటె వక్ఫ్ బోర్డు అనేది దేశవ్యాప్తంగా ఉన్న దర్గాలు , మసీదులను పర్యేవేక్షిస్తుందని మసూద్ పార్లమెంట్ లో తెలిపారు. తమ ఆస్తులను తాము చూసుకుంటామని , ముస్లిం మతపరమైన వ్యవహారాల నుంచి వక్ఫ్ బోర్డుని వేరు చేయలేమని మసూద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed