Nipah : నిఫా మృతుడి పేరెంట్స్‌కు నెగెటివ్.. ఆరోగ్యశాఖ నివేదిక

by Hajipasha |
Nipah : నిఫా మృతుడి పేరెంట్స్‌కు నెగెటివ్.. ఆరోగ్యశాఖ నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో : నిఫా వైరస్‌ సోకి ఈనెల 21న బాలుడు(14) మృతిచెందిన చెందిన ఘటనతో కేరళ హైఅలర్ట్‌పై ఉంది. ఆ బాలుడి కుటుంబీకులు, వారితో సన్నిహితంగా మెలిగిన ఇరుగుపొరుగువారిని రాష్ట్ర ప్రభుత్వం హై-రిస్క్ కేటగిరీలో చేరింది. మృతుడి కుటుంబం కాంటాక్ట్ లిస్టులోని దాదాపు 406 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.

వారిలో పలువురి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి టెస్టులు చేయించగా.. మంగళవారం 9 మందికి నెగెటివ్ వచ్చింది. ఈ జాబితాలో బాలుడి పేరెంట్స్‌తో పాటు పాలక్కడ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు సన్నిహితులు ఉన్నారు. కాంటాక్ట్ లిస్టులోని మరికొందరి టెస్టుల ఫలితాలు మరో 24 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ఈవివరాలను కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విలేకరులకు వెల్లడించారు.



Next Story