- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
JaiShankar: మాల్దీవుల పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్
by S Gopi |
X
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగస్టు 9-11 తేదీల మధ్య మాల్దీవులలో అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించడం లక్ష్యంతో జరగనున్నాయి. జైశంకర్ తన రెండో టర్మ్ విదేశాంగ మంత్రిగా ఎన్నికైన తర్వాత మాల్దీవులకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. చివరిసారిగా జైశంకర్ 2023, జనవరిలో మాల్దీవులను సందర్శించారు. ఈ నెల ప్రారంభంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత్ నుంచి మాల్దీవులకు అవసరమైన వస్తువుల ఎగుమతి కోసం మనదేశం రెండు అదనపు ఓడరేవులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story