Bangladesh : బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. అమిత్‌షాతో మేఘాలయ సీఎం భేటీ

by Hajipasha |
Bangladesh : బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. అమిత్‌షాతో మేఘాలయ సీఎం భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న ప్రతికూల పరిణామాల ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై పడొచ్చనే ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ టైన్సాంగ్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న అలజడిపై మేఘాలయ సరిహద్దు ప్రాంతాల ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి ఈసందర్భంగా అమిత్‌షాకు సంగ్మా వివరించారు.

మేఘాలయ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన ఆవశ్యకతపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. మేఘాలయలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి చెప్పారని పేర్కొంటూ సీఎం కాన్రాడ్ సంగ్మా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులను సురక్షితంగా ఉంచుతామని కేంద్ర సర్కారు నుంచి భరోసా లభించిందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed