- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భారీగా నక్సలైట్ల లొంగుబాటు.. కారణం తెలిస్తే షాక్!
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్ఘడ్ లో సోమవారం భారీగా నక్సలైట్లు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట 25 మంది నక్సలైట్లు లొంగిపోగా.. వీరిలో చాలామంది మీద భారీ రివార్డులు ఉన్నాయి. మావోయిస్టు పార్టీకి చెందిన వీరంతా ఛత్తీస్ఘడ్ లోని భైరమఘడ్, గంగ్లూర్ ఏరియా కమిటీలో పని చేసేవారని జిల్లా ఎస్పీ తెలిపారు. మావోయిస్టు భావజాలంలో వస్తున్న మార్పుల పట్ల వ్యతిరేకత, నేతల దౌర్జన్యాలు భరించలేక వారంతా లొంగిపోతునట్టు మీడియా సమావేశంలో తెలియ జేశారు. లొంగి పోయిన వారికి రూ.25 వేలు సహాయంతో పాటు, పునరావాసం కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. అయితే లొంగిపోయిన వారిలో ఇద్దరి మీద రూ.8 లక్షల రివార్డు ఉంది. 2020లో, 2021లో బీజాపూర్ లో గ్రేహౌండ్స్ దళాల మీద జరిగిన దాడుల్లో వీరి పాత్ర ఉంది. ఇప్పటి వరకు బీజాపూర్ లో ఈ ఒక్క ఏడాదిలోనే 170 మంది లొంగిపోగా, 350 మంది అరెస్టయ్యారు.
Next Story