Jammu & Kashmir: భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

by GSrikanth |
Jammu & Kashmir: భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది. కుప్వారా జిల్లాలోని మచల్ సెక్టార్‌లోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కాగా, పీఓజేకేలోని ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్స్‌లో వందలకొద్ది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే, వీరి ప్రయత్నాలను భారత బలగాలు ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తున్నాయి. తాజాగా.. మరో నలుగురు ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చొరబడేందుకు ప్రయత్నించగా.. వెంటనే అప్రమత్తమైన బలగాలు, స్థానికులు సంయుక్తంగా కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు.



Next Story