- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. శరద్ పవార్ను కలిసిన అజిత్ పవార్..
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ సహా పలువురు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతలు ఆదివారం ముంబైలోని శరద్ పవార్ ఆఫీసుకు వెళ్లారు. శరద్ పవార్తో వారు కొన్ని నిమిషాల పాటు మాట్లాడారు. పవార్ను కలిసిన అనంతరం ఎన్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. శరద్పవార్ ఆశీస్సుల కోసమే ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్ను కోరామని చెప్పారు.
తమ విజ్ఞప్తిపై ఆయనేమీ స్పందించలేదని వెల్లడించారు. "ఈ రోజు మేం మా దేవుడు, మా నాయకుడు శరద్ పవార్ ను కలిశాం. శరద్ పవార్ ఆఫీసుకు వచ్చారని మాకు తెలిసింది. అందుకే మేమంతా అపాయింట్మెంట్ అడగకుండానే ఆయన ఆశీర్వాదం కోసం వచ్చాము" అని ప్రఫుల్ పటేల్ చెప్పారు. శరద్ పవార్ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ పాటిల్, అదితి తత్కరే, హసన్ మష్రిఫ్ తదితరులు ఉన్నారు.