విజయం దిశగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి

by Harish |
విజయం దిశగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్‌లోని పాటలీపుత్ర నియోజకరవర్గం నుంచి పోటీ చేస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమార్తె మిసా భారతి ఈ ఎన్నికల్లో భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్‌పై 3,04,635 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రామ్ కృపాల్ యాదవ్ 2,74,502 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. మిసా భారతి గతంలో రెండు సార్లు ఓటమిని చవిచూడగా, ఈ సారి మాత్రం ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తూ విజయం దిశగా దూసుకుపోతున్నారు. అదే సమయంలో లాలూ యాదవ్‌కు కిడ్నీ ఇచ్చి ప్రాణం కాపాడిన మరో కూతురు రోహిణి ఆచార్య బీజేపీ సీనియర్‌ నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూడీకి చెప్పుకోదగ్గ పోటీని ఇవ్వలేకపోతోంది. రోహిణి ఆచార్యపై రాజీవ్ ప్రతాప్ రూడీ ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement

Next Story