Kolkata rape-murder case: కోల్ కతా హత్యాచారం కేసులో వెలుగులోకి వచ్చిన మరో విషయం

by Shamantha N |
Kolkata rape-murder case: కోల్ కతా హత్యాచారం కేసులో వెలుగులోకి వచ్చిన మరో విషయం
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై దారుణానికి పాల్పడే ముందు కోల్ కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు పోలీసులు వర్గాలు పేర్కొన్నాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి నిందితుడు కోల్ కతాలోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు తెలిపాయి. ఆర్జీకర్ హాస్పిటల్ కు చెందిన మరో సివిక్ వాలంటీర్ తో కలిసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు సమాచారం. వీరిద్దరు కలిసి ఓ బైక్ ని అద్దెకు తీసుకుని సోనాగచికి అర్ధరాత్రి సమయంలో వెళ్లారు. అక్కడ రాయ్‌ బ్రోతల్ హౌజ్ బయట నిలుచోగా.. అతడి మిత్రుడు లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత రాత్రి 2 గంటలకు అనంతరం రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్‌కతాలోని ఓ వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ టైంలో రోడ్డుపై వెళ్తున్న మహిళను సంజయ్ రాయ్ వేధించినట్లు అధికారులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న అతడు మహిళను న్యూడ్ ఫొటోలు కావాలని అడిగినట్లు తెలిపారు. ఉదయం 3.50 గంటల సమయంలో ఆర్జీకర్ హాస్పిటల్ చేరుకున్న నిందితుడు.. ఆపరేషన్ థియేటర్ డోర్ ని పగులగొట్టాడని పేర్కొన్నారు. ఆ తర్వాత అత్యవసర విభాగంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. మూడో అంతస్తులో ఉన్న సెమినార్‌ గదిలోకి వెళ్లిన నిందితుడు.. ఆ టైంలో అక్కడ గాఢ నిద్రలో ఉన్న యువతిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

సీసీటీవీ ఆధారంగా నిందితుడి అరెస్టు

ఇక, ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి 11 గంటల సమయంలో ఆర్జీకర్‌ హాస్పిటల్ వెనుక వైపు నిందితుడు మద్యం తాగినట్లు పలువురు తెలిపారు. ఆ టైంలోనే అశ్లీల వీడియోలు కూడా చూసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగాక చాలాసార్లు హాస్పిటల్ ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక బాధితురాలు చనిపోయిన విషయం ఆగస్టు 9న ఉదయం వెలుగులోకి వచ్చింది.తొలుత యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది సమాచారం తెలిపారు. కానీ, ఆ తర్వాత దీన్ని హత్యగా తేల్చారు. బాధితురాలు చనిపోయిన సెమినార్‌ హాల్‌లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed