రిజర్వేషన్లపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

by Shamantha N |
రిజర్వేషన్లపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ సంస్థల్లో గ్రూప్‌ సీ,గ్రూప్‌ డీ పోస్టుల్లో కన్నడిగులకు (కన్నడ ప్రజలు) 100 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ జారీ చేసిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఆ భేటీ తర్వాత రిజర్వేషన్ బిల్లుపై కేబినేట్ సభ్యులు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. తమ ప్రభుత్వం కన్నడ ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారికి అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని.. వారి సంక్షేమమే మా ప్రాధాన్యత అని సిద్ధరామయ్య అన్నారు. ఈ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు న్యాయశాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed