Karnataka Cess: కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. సినిమా టిక్కెట్లు, OTT సబ్‌స్క్రిప్షన్‌లపై 2% సెస్

by Harish |   ( Updated:2024-07-20 12:59:44.0  )
Karnataka Cess: కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. సినిమా టిక్కెట్లు, OTT సబ్‌స్క్రిప్షన్‌లపై 2% సెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్లు, OTT సబ్‌స్క్రిప్షన్‌లపై 2 శాతం సెస్ విధించే ప్రతిపాదనలపై చర్చిస్తుంది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సినీ కళాకారులు, సాంస్కృతిక ప్రదర్శనకారులకు ESI, PF వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలకు ఉపయోగించాలని చూస్తుంది. దీనికి సంబంధించిన ఓ బిల్లును కూడా రూపొందించింది. కర్ణాటక సినీ, సాంస్కృతిక కళాకారుల సంక్షేమం బిల్లు- 2024ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కళాకారులకు సామాజిక భద్రత, సంక్షేమాన్ని అందించడానికి ఉద్దేశించిన పథకాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఒక నిధిని రూపొందించాలని ప్రతిపాదించారు.

ఈ బోర్డులో వివిధ సాంస్కృతిక రంగాలు, అకాడమీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పదిహేడు మంది ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యులు, ఆ శాఖ మంత్రి, సీనియర్ IAS అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ సెస్ మొత్తం రెండు శాతానికి మించబోదు. ప్రతి మూడు సంవత్సరాలకోసారి సెస్ మొత్తాన్ని సవరించేలా బిల్లుకు రూపకల్పన చేశారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ, నాటకం, సంగీతం నృత్యం, యక్షగానం, లలితకళలు వంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన అకాడమీల ద్వారా సినిమా, సాంస్కృతిక కళాకారులకు సంక్షేమ బోర్డు ద్వారా సహాయాన్ని అందిస్తారు.

మరోవైపు సినిమా టిక్కెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై కొత్త సెస్‌ విధించాలన్న కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనను బీజేపీ విమర్శించింది. పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, ఎక్స్‌లో వ్యాఖ్యనిస్తూ, ఈ ప్రతిపాదనతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మరోసారి దాడి చేసిందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed