- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Kanpur: రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్.. లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్లో భారీ రైల్వే ప్రమాదం తప్పింది. కాన్పూర్ జిల్లాలోని ప్రేమ్ పూర్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలను తప్పించేందుకు పలువురు కుట్ర పన్ని ట్రాక్పై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను పెట్టారు. దీంతో అదే ట్రాక్పై కాన్పూర్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ఓ గూడ్స్ రైలు లోకో పైలట్ సిలిండర్ను గుర్తించారు. అనంతరం అత్యవసర బ్రేకులు వేసి రైలును గ్యాస్ సిలిండర్కు సమీపంలో ఆపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రాక్పై ఉంచిన 5 కిలోల సిలిండర్ స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు. కాగా, సెప్టెంబరు 15న కూడా కాన్పూర్లో ఒక ట్రాక్ దగ్గర పాడైపోయిన గ్యాస్ సిలిండర్, ఇతర అనుమానాస్పద వస్తువులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి గ్యాస్ సిలిండర్ రైలు పట్టాలపై ఉంచడంతో రైల్వే భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది.