- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Jp Nadda: మీ నాయకుల అకృత్యాలను మర్చిపోయారు.. ఖర్గే లేఖకు నడ్డా కౌంటర్
దిశ, నేషనల్ బ్యూరో: రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటిని నియంత్రించాలని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇటీవల ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఖర్గే లేఖపై బీజేపీ చీఫ్ నడ్డా స్పందించారు. ఈ మేరకు గురువారం ఖర్గేకు లేఖ రాశారు. రాహుల్ గాంధీ సహా మీ నాయకులు చేసిన అకృత్యాలను మరచిపోయారా అని ప్రశ్నించారు. ఖర్గే చెప్పిన విషయాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘ప్రజలచే పదేపదే తిరస్కరించబడిన మీరు. తిరిగి మార్కెట్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ లేఖ రాసినట్టు అర్థమవుతోంది’ అని తెలిపారు. ‘రాహుల్ దేశ ప్రధానితో సహా మొత్తం ఓబీసీ వర్గాన్ని దొంగలు అంటూ దుర్భాషలాడారు. దేశ ప్రధానిపై అసభ్య పదజాలం ఉపయోగించారు. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు. అటువంటి వ్యక్తిని మీరు బలవంతంగా ఎలా సమర్థిస్తారు’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన దుశ్చర్యలను ఉద్దేశపూర్వకంగా విస్మరించినట్లు లేఖలో కనిపిస్తోందని ఆరోపించారు.