ఆదిత్య- ఎల్ 1 శాటిలైట్‌పై ఇస్రో కీలక ప్రకటన

by Satheesh |
ఆదిత్య- ఎల్ 1 శాటిలైట్‌పై ఇస్రో కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారతదేశపు మొదటి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్ 1 లాగ్రాంజ్ పాయింట్ దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇటీవల నాలుగో కక్ష్య పెంపు విజయవంతంగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదిత్య ఎల్ 1 పై కీలక అప్డేట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆదిత్య-ఎల్1 శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని వెల్లడించింది. మిషన్‌లోని స్టెప్స్ పరికరానికి అమర్చిన సెన్సార్లు భూమికి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే సప్రా-థర్మల్, ఎనర్జిటిక్ ఐయాన్స్, ఎలక్ట్రాన్స్‌ను కొలవడాన్ని ప్రారంభించాయని తెలిపింది. భూమి చుట్టూ ఉండే కణాల ప్రవర్తనను విశ్లేషించడంలో ఈ డేటా దోహదపడుతుందని ఒక గ్రాఫ్‌ను ఇస్రో విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed