మీ కాళ్లు మొక్కుతా..పనులు సకాలంలో పూర్తి చేయండి: ఓ కంపెనీ ప్రతినిధికి బిహార్ సీఎం విజ్ఞప్తి

by vinod kumar |
మీ కాళ్లు మొక్కుతా..పనులు సకాలంలో పూర్తి చేయండి: ఓ కంపెనీ ప్రతినిధికి బిహార్ సీఎం విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏదైనా పనిని పూర్తి చేయాలని అధికారులకు, ఇతర కంపెనీ ప్రతినిధులకు, కాంట్రాక్టర్లకు సీఎంలు హెచ్చరికలు జారీ చేయడం చూశాం. కానీ బిహార్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం ఓ పనిని తొందరగా చేపట్టాలని కోరుతూ ఓ కంపెనీ ఓనర్ కాళ్లు మొక్కబోయాడు. ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..పాట్నాలో ట్రాఫిక్‌ను సులభతరం చేసే ‘జేపీ గంగా పాత్‌వే’ ఫేజ్ 3 ప్రారంభోత్సవ కార్యక్రమంలో నితీశ్ పాల్గొన్నారు. అనంతరం ఆ ప్రాజెక్టును నిర్మించే సంస్థ ప్రతినిధి అక్కడే ఉండటంతో ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కావాలంటే మీ కాళ్లు మొక్కుతా అంటూ ముందుకు కదిలారు. ఆ ప్రతినిధి అడ్డు చెప్పడంతో మరింత ముందుకు వెళ్లిన నితీశ్ ఆయన చేతులు పట్టుకున్నారు. దీంతో కంగుతిన్న ఆ సంస్థ ఓనర్ ‘సర్‌, దయచేసి అలా చేయొద్దు’ అంటూ వెళ్లి పోయాడు. సీఎం తీరుపై అక్కడున్న అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

Advertisement

Next Story