- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రైల్వే ట్రాక్పై పేలుడు పదార్టాలు.. ఒక్కసారిగా పేలడంతో 39 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ పట్టాలు
దిశ, వెబ్ డెస్క్: దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది దుండగులు గత కొంత కాలంగా రైళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్లే రైలు మార్గాల్లోని పట్టాలపై ఇనుప కడ్డీలు, గ్యాస్ సిలిండర్లు, రాళ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో పలువురు లోకో పైలట్లు పట్టాలపై ఉన్న వస్తువులను గమనించి వాటిని తొలగిస్తుండటం తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాము. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా రైల్వే ట్రాక్ పై పేలుడు పదార్థాలు అమర్చారు. అయితే ట్రైన్ రాకముందే.. ఒక్కసారిగా అవి పేలిపోవడంతో రైలు పట్టాలు దాదాపు 39 మీటర్ల దూరంలో ఎగిరి పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్గంజ్ జిల్లా రంగాగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. కాగా ఈ పేలుడు సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగులు అమర్చిన పేలుడు పదార్థాల కారణంగా జరిగిన పేలుడుతో ఏర్పడిన ముడు అడుగుల లోతు గుంటను అధికారులు పరిశీలించారు. కాగా ఈ దుశ్చర్యకు పాల్పడింది ఎవరనే విషయంపై విచారణ చేపడతామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.